Skip to main content

Posts

Showing posts from May, 2010

పార్ట్-35

దురదృష్టం ఏమంటే --నేను రాస్తున్న --మా కథ చదవడానికి - నాతోపాటు ఆనందం అనుభవం --కన్నీళ్లు కడగండ్లు -ఎన్నో రకాల తీపి చెడు సంఘటనలు భయంకర మైన దృశ్యాలు --వారి మాటలు చేతలు కృత్యాలు --ఇలా నాతొ పంచుకోడానికి -- మా కథ లో ముఖ్య పాత్ర దారులు ఇప్పుడు నాతొ లేరు ! --ఈ కథ ఎవరి కోసం? పోయి నోల్లు అందరు మంచోళ్ళు ---! ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు--! పాడుతా తీయగా చల్లగా --! ఇలా నాలో నేనే నెమరేసుకునే తీయని జ్ఞాపకాలు మధుర స్మృతులు --ఎన్నటికి చెరగని ముద్రలు --అండ మైన అనురాగ భావాలు --ఆనాటి చేదు తలపులు --ఇవన్ని కలబోస్తే ఉగాది నాటి ఐదు రకాల పచ్చడి తిన్నట్లు గా ఉంటుందికదా --!నేటి భవిత పాత అనుభవాల పునాది పైనే కట్ట బడి ఉంటుంది సుమా --! చరిత్ర లేని వాడు --దానిని మరిచిన నాడు --మనిషి పుట్టుకకు అర్థం ఉండదేమో --! మా అమ్మ --మా బాపన్న మా సీనన్న --ఇప్పుడు నాతొ లేరు భౌతికంగా --కాని నా మనసులో నేను ఉన్నన్నాళ్ళు నాతొ బాటు నాలో సజీవంగా ఉంటారు --ఎందుకంటే నేను అనబడే నా చరిత్రకు నా సౌఖ్యాలక...

పార్ట్-34

మాకు కొట్టం లోకి రావడానికి ముందు చాలా భయమేసింది నిజంగా అక్కడ ఎంత కష్టమో --ఎంత ఇబ్బంది పెడతారో ఈ పాళీ వాళ్ళు అని- కాని బాపన్న రామ చందర్ రావుల నీడలో మేము కడుపు నిండా తిన్నాము కాంతి నిండా నిద్ర పోయాము అతని అభయ హస్తం నిజంగా మాకు శ్రీ రామ రక్షా ! మేము చాలా సంతోషంగా ఉన్నాం అంతవరకూ పడ్డ కస్టాలు మరిచాం - అమ్మ తన ఇస్తా దైవాన్ని మాత్రం మరచి పోలేదు పైగా రెట్టింపు కాసాగింది--అక్కడ ఒక తులసి గద్దె చక్కగా ముగ్గులు పూజ పునస్కారాలు -ఉపవాసాలు బ్రాహ్మల సత్కారం పండుగల్లు ----ఇలా పేరుకు కొట్టం కాని మేమ్ము అలా ఎన్నడు అనుకోలేదు --చాలా ఆనందంగా గడిపాం --ఊరి బయట స్వేచ్చగా స్వతంత్రంగా హాయిగా ఉన్నాం --మాకు అంటే నాకు సీనన్నకు చేనులు చేలకలు పేర్లు పొలాలు మనవి ఎక్కడనో ఏవో తెలిసి పోయింది - --కొత్తంలోంచి ఉల్లోకి పోవడం అమ్మకు సుతరామూ ఇష్టం లేదు 1 అక్కడే తను భర్తతో ఇంటి నుండి బయటకు తరిమి వెయ బడింది ౨ తెల్లారితే ఎవరో ఒకరు మరదులు ఈ ఇంటికి వస్తారు తినేద్ది తాగేది చూస్తారు వెటకారం మాటలు అంట...

పార్ట్-33

రుణాను బంధ రూపేన పశు పత్ని సుతాలయా ! ---అని పెద్దల మాట -- అకోట్టంలో ఉండగా ఎడలా తో బర్లతో చాలా సన్నీ హిటంగా ఉన్నాం ---ఒక బర్రె --దానికి లక్ష్మి అని పేరు అమ్మ పెట్టిది మేము బయట ఎక్కడా ఎప్పుదూ పాలు కొనే అవసరంలేకున్న్డా ఆది మాకు సమృద్దిగా పాలు పెరుగు నెయ్యి వెన్నా --పాడితో మా అందరి కడుపులు నింపేది ---! శ్రీరామ రక్షలా ఆ రామ చందర్ రావు మాకు పెద్ద దిక్కుగా ఉండి అన్ని తనే చూచే వాడు --ఇంటి పెద్ద అయి ఏది కావాల్సినా ఏది చేయాల్సిన తనే స్వయంగా ఆ పని చిన్నదైన పెద్దదైనా శ్రద్దగా పూర్తీ చేశాడు --తండ్రి అన్న తాత బందువు స్నేహితుడు అన్ని అతడే అనిపించింది ఆ సమయంలో ---వ్యవ సాయంలో మంచి పంటలు పండిచి అమ్మి డబ్బు పోగు చేసి ఇంటి కోసం జమ చేశాడు తాను గూడా బాపంనతో సహా తన బలగం తో అంటే పాలేర్లతో అడవికి వెళ్ళాడు టేకు కర్ర తేవడానికి ---బాపన్నకు తోడుగా నిలబడ్డాడు కుటికెల ఎల్లయ్య ఇంకా నలుగురు మద్దత్తు చేశారు --ఉరివాళ్ళు కూడా ఉల్లోకి రావడానికి తమ వంతు సహాయం చేశారు --ఇలా రాజి కుక్కనే గాక --ఈ లక్ష్మ...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-31

రాగంపేట కు రాకముందు పెద్దమామ దర్పం వైభవం ఠీవి రాజసం అట్టహాసం ఆ రోజుల్లో మరెవరికి లేవు --గూడూరు దొరల్లో ఈయన పేరు పొందిన రారాజు --16 మంది గుమాస్తాలు -వచ్చే పేయ్ వాళ్లకు వండి పెట్టడానికి వంట బ్రాహ్మడు లేదా బ్రాహ్మనమ్మ అప్పసంగా ఇల్లు పట్టుకుని ఉండే వాళ్ళు --4 పాలేర్లు నలుగురు బెస్త పనిమనుషులు ఏమ్బటి లింగయ్య బెస్త రాజయ్య బెస్త పోశి లష్మి వెడ్డి రామి --ఇలా ఇంటి నిండా జనమే --పిల్లలు జయక్క ఉదయమ్మ---వాళ్ళు పుట్టినప్పటి నుండి లగ్గాలయ్యే వరకు ఇక్కడే పెరిగారు --తర్వాత మేము వచ్చాము ఒకరోజు పొలాల అమావాస్య నాడు యాభై పశువులు ఎడ్లు అందంగా శృంగారించి మేడలో పుల దండలు వేసి కొమ్ములకు పైనా రంగు పూసి ఆ ఊరిలోని పశువులతో కలిపి ఉరవతల అన్నిటిని ఒకేచోట నిలిపి దప్పుల తో ఆనందంగా వాటి చుట్టూ ఎగిరి --చివరకు అందరు తమతమ ఎడ్ల తో ఉత్సాహంగా వాటిని తరుముతూ --ఎల్లోకి తీసుకొస్తారు --పాలేర్లకు ఈనాములుఇస్తారు తాగినంత తిన్నంత --వారికి అటు పశువులకు దానా --చాలా గొప్పగా ఉండేది మనకు దసరా ఎలాగో ఆనాడు...

పార్ట్-30

ఉళ్ళో ఇంటి పని ప్రారంభ మైంది -- పునాదులు తవ్వుతున్నారు-- అటు మా చదువు కుంటూ బడుతోంది --బడికి పోవడం కంటే ఇంటి వద్ద ఉళ్ళో అందరు పని చేస్తోంటే బాపన్న దగ్గర కూర్చొని ఆక్కడే అదే మట్టితో ఆడుకుంటూ పొద్దు పోయేదాకా అక్కడే గడిపే వాన్ని --సీనన్న కొట్టంలోనే అమ్మతో గడిపే వాడు నును వస్తేనే సీనన్న కు బడి లేక పొతే లేదు --ఇది గమనించి అమ్మ పెదమామకు చెప్పి ఒక సైకిల్ కొని తెప్పించింది -- ఇక సైకిల్ ప్రయాణం మొదట్లో సంబరమే --అనిపించింది --ఉదయం స్నానం తిండి చద్ది మూటా--అయ్యాక నన్ను హేండిల్ ముందు కూర్చో పెట్టుకుని సీనన్న సైకిల్ తొక్కుతూ చొప్పదండి వరకు తీసుకెళ్ళి --తిరిగి చుట్టి అయ్యాక మళ్లీ నన్ను కూర్చో బెట్టుకుని రావాలి --అయితే మాకు తోడుగా తీగల అంజయ్య అని మాతో బాటు వస్స్తూ చదువు కుంటూ మామ్మ్ల్ని విడవకుండా ఉండేవాడు అతనికి మా అమ్మ మమ్ములను చుస్తున్దాలని ఎప్పుడు కని పెట్టాలని అతనికి అప్ప చెప్పింది --అమ్మ మీది గురితో మాకు అంగ రాక్షకుడిలా ఎటు పొతే అటు వచ్చే వాడు అతనితో చక్కగా ఆడుకునే వాళ్ళం ---ఆ రోజు చాల...

పార్ట్-29

మా కథ అంటే -- నా చదువు సీనన్న చదువు మొదలైనాయి మాకు ఎ బడిలో కూడా శ్రీకారం చుట్టలేదు ఎవరూ --ఇంతవరకు ఎ బడికి పోలేదు కూడా నాకు పదేళ్ళు సీనన్నకు 12 మాకు పక్కన గౌండ్లోల్ల పిల్లగాడు చొప్పదండి బడిలో చదువు కోసం --అక్కడే ఉంది వండు కుంటూ 7 తరగతి చదువు కొంటున్నాడు --మా అమ్మ వాణ్ణి పిలిచి వాణి తండ్రికి చెప్పి --మా పిల్లలు కూడా నీ రూం ప్రక్కనే రూం తీసుకుని నీ దగ్గర ఉంది చోప్పదండిలో ఉంటారు చదువు కుంటారు అని అడిగింది సరే ! మంచిది కానియ్యి ---అంటూ వారి ప్రక్కన రూం లోనే ఉంటూ మేము ఇద్దరం వండుకుంటూ --చోప్పదండిలో నేను 5 సీనన్న 7 తరగతుల్లో నేరుగా ప్రభుత్వ పాట్ట శాలలో చేరాం ఆరోజు బాపన్న వచ్చి మమ్మల్ని చేర్పించాడు --అయితే అప్పుడు వయసును బట్టి మాత్రమె ఆయా తరగతుల్లో ప్రవేశానికి అనుమతి ఉండేది -- నిజానికి మాకు ఆ చదువుల్లో ఇద్దరకి శ్రద్ధ ఉండేది కాదు పైగా అక్షరాలూ కూడా పలకరాని చదువలేని దశలో ఉన్నాం మేమిద్దరం --అప్పుడు --అందుచేత చదువు రాక చదువ లేక - ప్రతి రెండు రోజులకు రాగంపేటకు పారి పోయే వాళ్ళం --అంటే ఎప్ప...

పార్ట్-28

చిత్రంగా మా కథ ఇక్కడ మలుపు తిరిగింది --ఉహించని తీర్పు తాత గారు ఇచ్చారు -అందరు ఆశ్చర్య పోయారు కొట్టంలో కొచ్చి రెండేళ్లయ్యాక-- మమ్మల్ని ఉల్లోకోచ్చి ఉండమని --కొట్టంలో ఉంటె అతనికి అవమానంగా ఉందని - తిండి పోత లేదని నిద్ర పడత లేదని --! బాపంనతో ఒక రోజు అన్నాడట --అయితే ఈ మార్పుకు మాటలకు చాలా కారణా లున్నాయి 1 రామచందర్ రావు గారి దయ వల్ల పట్టినంత పంటా ఇంటినిండా --వడ్లు కందులు పెసల్లు జొన్నలు మక్కలు ప్రతి పంటా పండి -గుమ్ములన్ని ధాన్యంతో నిండి పోయాయి పంటలు -పుష్కలంగా పండాయి వర్షాలు సమృద్దిగా కురిశాయి --దేనికి కొరత లేదు --- పాలేర్లు పశువులు నాగళ్ళు -పని మనుషులు ఉళ్ళో నుంచి రైతులు షావుకార్లు ఇక్కడికి రావడం అమ్మ పేరు ఉళ్ళో మంచిగా వినపడటం --దానికి తగట్టుగా -అమ్మ అందరికి అనునయంగా మాట్లాడటం --ఏర్కల వాళ్లకు బట్టా బాతా అన్నం పలహారాలు ఇస్తుండటం బ్రాహ్మలకు పండగలకు పబ్బాలకు పిలవడం పూజలు దానాలు చేసుకున్తున్డటం -- ఇవన్ని వెంకటమ్మ వేంకటేశ్వర రావు లా చెవుల విన పడుతున్నాయి ఆది సహించ లేక పోతున్నా...

పార్ట్-27

నేను బ్రతకాలని కాబోలు ---మా అమ్మ సీనన్న ఇపుడు బాపన్న తమ కు మిగిలిన ఆయుష్షును నాకు ధారవోసి వాళ్ళు తమ విలువైన జీవితాన్ని చాలించారు --నాకు బాపును గూర్చి విన్నదే కాని చూడలేదు కావున ఆ విన్నదే రాయగలను ఆది కొంత మాత్రమె మనెను ధారణా చేసి నాకు జ్ఞాపక మున్నంత వరకే --! కాని మా బాపన్న గురించి అలా కాదు అతడొక సజీవ సంచలన చిత్రం కాదు నిజమైన సాకార కళల రూపం -- అతని మాటలు ఇంకా నా చెవిలో గుంగురు మంతునే ఉంటాయి --- వారీ ! నాకు ఎవరి నైనా ఒప్పించి మెప్పించడం చాట కాదురా ---వాడు విన్నా విన కున్నా గట్టిగ నాలుగు దులుపేయడం తప్ప --! నీకు చిన్నప్పుడు లాగు కూడా లేకుండా ఉంటె కనపడ్డవు -- ఒక చిల్లి పైసా నీకు ఇచ్చిన --అపుడు నీటు ఎంత సంతోషం కలిగిందో --నాకు ఇంకా యాదికున్నదిరా --! నా తమ్ముడు msc distinction తో పాసయ్యాడని మా పట్వారి సంఘంలో చెప్తుంటే నా కంటే వాళ్ళకే ఎక్కువ సంతోష పడ్డర్రా ---! కొట్టంల మనం ఉండంగా--నిన్ను ఎద్దు కుమ్మ వచ్చింది --నేను అప్పుడే వచ్చిన నువ్వు ఏడుస్తున్నావ్ --భయపడుకుంట --ఇరికి ...

పార్ట్-26

మేము కొట్టం లో అడుగు పెట్టడం బాపన్నకు తల పై మోయలేనంత గా భారం పడింది --ఏమి చేయ లేడు లాని ఏదైనా చేయాలి --అన్న ఆలో చనతో ఇప్పటినుంది పెద్దరికం ప్రారం భ మైంది పాపం ! వయసుకు మించిన భారం --బరువు బాధలతో మా బాపుకంటే ఎక్కువగా బాధ పడ్డాడు బాపుకు తన వాళ్ళ తో సమరం బాపన్నకు కు కూడా అలాంటిదే కాని బాపుకు తగిన బలం మనుషులు ఉండే వారు పెద్దవాడు తెలివి శక్తి తట్టుకో గలిగిన మానసిక శారీరక బలం ఉన్నాయి బాపన్నకు అలా కాదు పండ్లలో నాలుక వలె తాత చిన్నాయనల మధ్య ఉంటూ బ్రతకాలి తన వాళ్ళను బ్రతికించాలి మేము రాక ముందు బాపన్నకు ద్యేయం లక్ష్యం ఆశయం ఉద్దేశం గమ్యం ---ఇలాటి వేమి లేవు --ఇప్పుడు ఏర్పడ్డాయి ఏదో తెలియని సంతోషం ఎత్సాహం దైర్యం లక్ష్య సిద్ది ఆరాటం ఏదో సాధించాలని తపన --అతనిలో మొలకెత్తాయి ---మేము రావడంతో అతనికి ఇన్నాళ్ళు తనకు ఎవరూ లేరు --అమ్మా తమ్ముళ్ళు ఇకడికి వస్తారో రారో ?--పోవాలన్నా రావాలన్నా పెదమామ అంటే భయం -- తన వాళ్లకు వీళ్ళు దూరం చేశారని తనకే కాదు ఉళ్ళో అందరికి తెలుసు--వీళ్ళను వ...

పార్ట్-25

ముళ్ళ బాటలో నీవు నడిచావు --పుల బాట లో మమ్ము నడిపావు -- ఓ నాన్నా ! నీ మనసే వెన్నా --అమృతం కన్నా --ఆది ఎంతో మిన్నా --ఓ నాన్నా---- పల్లెత్తు మాట కూడా అనరాని దుర్భాషలు --మా బావ భాషలో చెప్పాలంటే ఎక్కాలు దండకాలు ఇవేమీ బాపు తలి దండ్రులను కాని తమ్ములను కాని అన్నట్లు ఎవరూ చెప్పలేదు అమ్మ కూడా --ఆయన కెంత ఓపికో ఎన్ని తిట్లు తిట్టినా తల్లి అరచినా తండ్రి కోపించినా తమ్ములు నోటికొచ్చినట్లు అన్నా కిమ్మనకుండా ఉండే వాడట లేదా అక్కడ నుండి వెళ్ళే వాడట -- బాపు మంచంలో పడ్డాడు అంతే యుద్ధం సమాప్తి --అయింది --లేచి నిలబడే ఓపిక కూడా లేకున్దేంట నీరసం వచ్చిందట తాత వాళ్ళు చేడిది చేయించారని అంటారు - మనో వ్యాధికి మందు లేదని --ఆటను మరి కోలు కోలేదు దొరగారు వచ్చి చూసి ఇక్కడ ఉంటె లాభం లేదు పట్నంలో ఎవరైనా డాక్టర్కు చుయించాలి అన్నాడు రాం చందర్ రావునుడి బాపు మాట తీసుకున్నాడు తన స్తితి ఎలా ఉన్నా ఈ పిల్లాలు ఎదిగే వరకు తమను ఈ ఆస్తిని కాపాడాలని --- వెంగయ్య పటేలు బాపు బలం లేక పోవడంతో మునుపటిలా హుషారుగా ల...

పార్ట్-24

అన్న మాట కోసం రాముడు పాండవులు అడవుల పాలయ్యారు -ఘంటసాలా ఘారు పాడిన పాట రింగుమని మోగుతుంది విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలైరిరా ఎ యుగమందు ఎ ఇల్లాలు ఎరుగడు తల్లి ఈ అవమానం నీ పతి సేవయే నీకు రక్ష --- ఇది అక్షరాలా మాపట్ల నిజమైంది ఆది తప్పను నేను అన్న ఆ హరిశ్చంద్రుడు చాలా కష్టాల పాలయ్యాడు భార్యా బిడ్డలతో పడరాని పాట్లు పడ్డాడు ఒకవేళ బాపు తండ్రి చెప్పినట్లు వింటే --మిగిలిన ఐదుగురికి ఇంతటి సత్వ ధర్మ గుణం రాలేదు --ఒకే కడుపు ఒకే రక్తం లంకలో విభిశానుడిలా మా బాపు --అదే జీన్స్ లో ఎంత తేడ --మాకు అలాంటి సజ్జనుడు తండ్రిగా దొరకడం ధర్మానికి కట్టుబడి ఇచ్చిన మాటకు ఇన్ని పాట్లు పడ్డాడు వీరయ్య పంతులుకు మా తాత బాపును కోటి లింగాల దేవాలయంలో గంగా తీరాన బాపుకు ఐదేండ్ల వయసులో శివ లింగం మీదుగా పెమ్పకానికిచ్చాడు అక్కడ తహసిల్దారు ఇతర అధికారులు ఉన్నారు -అంతే --అయన లక్ష్మినరసింహారావు పేరు మీద తన యావదాస్తి వతన్లు రాసి ఇచ్చాడు బాజాప్తా ---ఇంకా గోత్ర ఖండన కూడా చేయలేదు రేవెల్లి వంశానికి నా పెద కొడు...

పార్ట్ 23

ఇప్పుడు బాపన్న చేసే వ్యవహారం అదే పట్వారి గిరి అప్పుడు మా బాపు చేశాడు కాని తనే స్వతంత్రంగా వీళ్ళను ఎదిరించి వీరి ప్రమేయం లేకుండా చేశాడు అయితే ఆది ఒక అంతర్ యుద్ధం బాపుకు ఆ దిక్కు మాలిన వ్యాధి రాక పొతే మా భవిత మరోలా ఉండేది --అద్భుత మైన పరిజ్ఞానం బాపుది--అప్పుడే వెంగయ్య పటేలు రంగ ప్రవేశం చేశాడు బాపు చేసే ప్రతి పనికి మాటకు వెనుక సమర్తించే వాడు --అతనికి చాలా పరపతి ఉంది స్వంత ఉరు బొమ్మారెడ్డి పల్లి అతనికి యాభై మంది గ్రూప్ గ్యాంగ్ ఉంది అతడు కను సైగ చేస్తే చాలు వారు ఎంతటిపని అయినా చేసేది ఆ గ్యాంగ్ --ఈ రకంగా ఊరి పట్టు బాపుకు మాత్రం చాలా అనుకూలంగా ఉండేది మరో వ్యక్తీ దేశాయి న్యాలకొండ రాం కిషన్ రావు గారు --ఆయనకు ఇప్పుడున్న పెద్ద దడి --ఒక నవాబులా ఉండేది అతని కోట గది 1000 ఎకరం పైన బూములు అతడు ఒక సర్వ భౌముదంటే అతిశ యోక్తికాడు మన కంటే ఎక్కువ ఆస్తి థాటు దర్పం హుందా ఊరిలో అజమాయిషీ --ఉంది గదిలో ఒక 20 మంది మనుషులు పని సేవ చేస్తూ అతన్ని దొరా దొరా ! అంటూ అతని అడుగులకు మడుగ...

పార్ట్-22

మరపు రాని మరొక వ్యక్తీ పెద పాలేరుగా పిలువబడే మనిషి కుటికెల ఎల్లయ్య --కులానికి హరిజనుడే అయినా గొప్ప గుణం మంచి తనం మేమంటే ప్రాణం ఇచ్చి మమ్మల్ని 24 గంటలు కంటికి రెప్పలా కావాలి కాశాడు అతడు భుజం పై గొంగడి చేతిలో పెద్ద కర్ర నాల్ల మీసం తో మాకు అంగ రక్షకుడుగా ఉన్నాడు 6 నాగళ్ల శాత --ఒక ఆవు 2 బార్లు ఉన్నాయి పాలకు పాడి కి కొదువ లేదు వర్షాలు పడేవి పుష్కలంగా పంటలు పండేవి ఈదుల మిట్ట వడ్లు పొయ్య దానికి గుమ్ములు చాలా లేదు రామ చందర్ రావు గారు కొట్టంలో అన్ని వసతులు చేశాడు ఒక చేద బావి రెండు గదులు వంట గిన్నెలు --దేనికి ఇబ్బంది లేకుండా చేశాడు -దేవుడిలా ఆదుకున్నాడు అమ్మ వంట వండేది ఏడుస్తూనే --అతడు అమ్మ్మను సముదాయించే వాడు --లచ్చయ్య పంతులుకు మంచి పేరుంది మీకు ఎంత అన్యాయం జరిగిందో లోకం చూస్తున్నది మీ ఉసురు ఉరికే పోదు వాళ్ళను నాశనం చేస్తది --ఈ కస్టాలు ఎల్లకాలం ఉంటాయా మనకేం తక్కువ --మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది --పిల్ల గండ్ల గురిచి రంది వద్దు మేం ఉన్నాం --! ఇలా అమ్మ్...

పార్ట్-21

గంగ దాటాం మేము సమయం ౬ అయ్యింది అమ్మ నేను సీనన్న మామ ఒకడు బండి తోలే వాడు ఒక మనిషి బండికి వెనుక నడుస్తున్నాడు కోతి లింగాల మొక్కట్ రావు పేట గుండా వెలగటూర్ చేరేసరికి 7 అయ్యింది సుమారుగా ౫ కు కరీం నగర్ నుండి బయలు దేరిన బస్సు ఇక్కడ 8 అయింది ---బస్సు ఎక్కి మల్లాపురం స్టేజి చేరుకునే సరికి 9 --అక్కడ మళ్లీ బండి ఎడ్లు రడీ ---రాత్రి ఎవరి కంతా బడ కుండా కొట్టంలోకి చేరుకున్న్నాం సుమారు పది కావచ్చు ! రామచందేర్రావు అన్నట్లు గానే మమ్మల్ని అంటి పెట్టుకుని ఎటు పోకుండా ఉన్నాడు --అమ్మ ఏడుస్తోంది ఎ ఊరిలో నుండి బాపుతో వెళ్ళామో బాపు లేకుండా --బాపును గంగ ఒడ్డున విడిచి --ఆటను లేకుండా --అతని ఉరికి వచ్చి నందుకు ---గుండె చేరు వయ్యేలా విలపించింది --అక్కడే ఆ రాత్రి బాపన్న మాతో ఉన్నాడు --బాపన్న ఎవరో మాతో అయన సంభంద మేమిటో ఆ రోజు నుండి తెలిసి వచ్చింది --నాకు సీనన్నకు --!నన్ను ఎత్తుకుని తన దగ్గర పడుకో బెట్టుకున్నాడు రామ చందర్ రావు అంత చిన్నవాన్ని నేను --7 సీనన్నకు 9 ఏళ్ళు ఉంటాయి ...

పార్ట్-20

మా అమ్మ లాటి అమ్మ లేదు ఈ జగం లో ! అని పృథ్వీ లోని ప్రతి ప్రాణి అను కుంటుంది --అదే అమ్మ గొప్పదనం ౧ శాస్త్రాల్లో పురాణాల్లో ఆమెకే పెద్ద పీట--అమ్మ దనంలోని లలోని కమ్మ దనాన్ని అను భ వించడానికి సాక్షాత్తు దేవ దేవునికే కోరిక కలిగి గర్భా నరకం 9 నెలలు ---కౌసల్యా దేవకీ తల్లులకు ఆ ఆనందం కలిగించడానికి తను పుత్రుడిగా జన్మించి తల్లి పాలు గ్రోలుతూ ఇటు యశోదా తనయుడిగా అటు దెవకీ నందనుడిగా ప్రసిద్ది పొందాడు మాత్రు వాత్సల్య మేమిటో స్వయం గా చవి చూచాడు ఆ పరమాత్ముడు తన బిడ్డల కోసం సర్వస్వాన్ని ధార పోసే త్యాగ గుణం ఈ జగత్తులో అమ్మ కు తప్ప మరెవ్వరికి కాన రాదు --మాత్రు దేవో భవ---తర్వాతనే పితృ దేవో భవ ---!ఆ భగవంతుడు తనకు బదులుగా అమ్మను సృజించా డెమో ఈ ప్రాణి కోటికి ! దైవత్వం మానవుడిలో తల్లి రూపంలో ఉంది అనడానికి ఆమె త్యాగ గుణమే అమ్మ మూలా ధనం ! మా అమ్మ తన భర్త పోయినా బ్రతికి ఉందంటే కేవలం మా కోసమే ! లేక పొతే తను ఎ నుయ్యో గొయ్యో చూసుకునేది ఈ దుర్భర మై...

పార్ట్-19

ఆ రోజు రానే వచ్చింది --తారక్కను అత్త వారింటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాడు ---భర్త లేకుండా - భారంగా ఇద్దరు చిన్న పిల్లలను వెంట బెట్టుకుని శోక దేవత లా కంటికి మంటికి ధారగా ఏడుస్తూ --వెడుతుంటే అందరు దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు --కన్న తల్లి మా అమ్మమ్మ సుర్యబాయి --పెద్దత్త సావిత్రి అత్త సాంబన్న మామ దుర్గత్త చిన్న మామ సులోచన అత్త ఇద్దరు చిన్నాయిలు ఇంకా చాలా జనం ఆవేదనతో మా అమ్మను మమ్ములను అంటే సీనన్న నన్ను ---సాంబన్న మామను తోడూ ఇచ్చి సాగనంపుతున్నారు లక్షెట్టి పేట నుండి రాగం పేటకు అపుడు మధ్యాహ్నం ౨ గంటలు కావస్తుంది ఎడ్ల బండిలో మేము బండి వెనుక శోక మూర్తులుగా మారిన పెద మామ తది తరులు ఊరి చివర వరకు వచ్చి వెనక్కివెళ్లి పోయారు ---గంగ దాటుతుంటే మా బాపును అగ్ని సంస్కారం చేసిన గంగ ఒడ్డున ఆ ప్రదేశాన్ని చూసి గుండె పగిలి పోయేలా ఏడవ సాగింది --- నిన్ను ఇక్కడ విడిచి నీవు లేని నీ ఉర్కి ఎలా వెళ్ళాను -- ! సాంబ శివా ! నేను కూడా ఈ ...

పార్ట్ 18

రాగంపేట కు వెళ్ళే ముందు ముగ్గురు ముఖ్య మైన వ్యక్తుల పరిచయం చాలా అవసరం 1 అమరవాది రామ చందర్ రావు చిట్యాల పల్లి 2 బొమ్మారెడ్డిపల్లి వెంగయ్య పటేలు 3 కాస లక్ష్మి రాజం రాగంపేట అందరికంటే ప్రథముడు మనకు పూజ్యుడు విశ్వాస పాత్రుడు వెలమ దొర --శ్రీ రామా చందర్ రావు గారు అతనికి మనం మన జీవితాంతం రుణ పడి ఉంటాము శ్రీ రామునికి ఆంజనేయుడు ఎలా నమ్మిన బంటో అలా మనకి బాపన్నకి ముఖ్యంగా అమ్మకు అంత ఆత్మా బందువు అయ్యాడు -- మా బాపు తను పోతూ మాకు ఇచ్చిన వరం రక్షక కవచం ఆయన పుట్టడం వెలమ పుట్టుకే అయినా మనకు మాత్రం చాలా దగ్గరి వాడయ్యాడు ---ఒక తోబుట్టువు కంటే ఎక్కువగా మా అమ్మ కు ఆప్యాయంగా చూశాడు --అమ్మా బాపు మేము లక్షెట్టి పేటకు పోయే సమయంలో మా బాపు ఈయనను రామచందేర్రావు ను వ్యవసాయం కొరకు సేర్ దారుగా నియమించాడు --బాపు గతించినా ఆయన బాపుకు ఇచ్చిన మాట తప్పకుండ మొత్తం జాయిదాడును కాపాడాడు పంటలను చిన్నాయనల బారి నుండి రక్షించి కొట్టంలో పెద్ద పెద్ద గుమ్ములలో నిలువ బెట్టాడు మన అదృష్టమా ఆయన రెక్కల కష్టం ...

పార్ట్-17

కరీం నగర్ లో రాయలేక పోయాను అక్కడే జరిగిన సంఘటనలు మనసును చిక్క బట్టేవి కావు కనుక బాపు తన తండ్రి చెప్పినట్టు విని ఉంటె ఏమయ్యేది? నాకు అనిపించి మా అమ్మతో అన్నాను ఒకసారి ఈ బాధలు కన్నీళ్లు ఉండేవికావుగా ! తనకు మనకు ? నిజమే ! తనకిచ్చిన ఆస్తి తన కష్టార్జితం కాదు ౧ ఆది వీరయ్య పంతులుది ! కుక్కలు చింపిన విస్తరి గా పంచి ఇవ్వదానికా అయన తనకు ఇచ్చింది ? వంశాన్ని నిలబెట్టమనీతన ఆస్తిని కాపాడమని ఇచ్చింది తనెలా తమ్ములకు ఇవ్వగలదు ? వారు రేవెల్లి వంశస్తులు కాదె ?ఇది ధర్మమా ? వీరయ్య పంతులు ఉంటె ఇలా చేస్తే ఉరు కుంతాడా ? మీరేవర్రా నా ఆస్తి తినడానికి అని అనేవాడా ! కాదా ? దీనికి సమాధానం ఉన్నదా ? ప్రతి వాడు నా ఇల్లు నా భార్యా అంటూ జూబ్లి హిల్స్ లో ఒక అందమైన ఇల్లు కొనుక్కొని నెలకు కొంత ఖర్చు పెట్టి కొంత వేన కేసుకుని పేపర్ చదువుతూ టీ తాగుతూ కూర్చుంటే ఈ ప్రజా సమస్యలు తీర్చేదేవాడు ? థామ్సన్ అన్ని ఒడులుకొని దీపం కనిపెట్టక పొతేఇపుడు మనం చీకట్లో కుర్చ...

పార్ట్-16

ఇక బుచ్చమ్మ విషయం ---భర్త మధుసూదనరావు కన్నాపురం యలబాక వైపు --5 అన్నదమ్ములు యితడు పెద్ద --కాని భార్య విషయంలో చిన్న --ఆమె కాపురానికి పోయింది చాలా తక్కువ అని చెప్పాలి ఆమె కూడా రూపవతి కాని ఎప్పుడు తల్లిగారింట్లో ఉండటం ఇతరులు పచ్చగా ఉంటె ఆరవ లేకుండా ఉండే గుణం తల్లి దగ్గర పుణికిపుచ్చుకున్నది .. అయన కూడా ఇక్కడే భార్య తో బాటు ఉంది పోయే వాడు ఫలితం తల్లికి ఎడమ కుడి భుజాల్లా వీరు తయారయ్యారు కోడళ్ళను కాలికింది చెప్పులా కాల రాయడంలో తల్లికి సంపూర్ణంగా సహకరించారు కలవారి కోడలు కావడం వీరి కంటే అన్నింటిలోను అమ్మ తల్లిగారు గొప్పవారు కావడం బంగారం సొమ్ములు పట్టు బట్టలు అదిరి పోయేలా పెట్టడం ఇదంతా అమ్మ వైభవంగా తలచి ఓర్వలేక హీనాటి హీనంగా అమ్మను చూశారు రాగం పేట జాయిదాదును అడ్డం పెట్టుకుని బాపుకున్నతోబుట్టువుల పై మమకారం తలి దండ్రుల పై గల భయం భక్తిని అడ్డు పెట్టుకుని సూటి పోటి మాటలతో అమ్మను చాలా వేదించారు ---అన్నం పెట్టక తిండికి సరి ఐన బట్టలేక పిల్లలకు తనకు సరిపోక చాలా అవస్తలు పడింది నాకు ఒకసారి ...

పార్ట్ 15

శకుని ద్యూతం ఫలించింది ఒకే దెబ్బకు రెండు పిట్టలు 1 ద్రౌప్పడి పరాభవం 2 పాండవుల అరణ్య అజ్ఞాత వాసాలు రావణ మాయ గెలిచింది 1 సీత ను లంకకు ఎత్తు కేల్లడం 2 రామున్ని కష్టాల పాలు చేయడం అలాగే పెద్ద పంతులు దురాశ జయించింది -- ౧ -మా బాపు రాగం పేటలో స్తానికంగా లేక పోవడం శాశ్వతంగా తొలగి పోవడం ౨ ఆస్తి అంతా తన చేతి కిందికి రావడం ---మా బాపు బతికితే ఇది అంత సులభ మయ్యేదికాడు కదా! పైగా బాపు పోవడం అసల్దారు పేరు బాపన్న పేర కావడం వారికి రొట్టె విరిగి నేతిలో పద్దత్తైయ్యింది మేము రాగంపేటకు రావాలనుకునే సందర్భంలో పరిస్తితులు వారికి చాలా అనుకూలంగా మారాయి -- అందరికి ౫ గురు అన్నదమ్ములకు లగ్నాలు అయ్యాయి నారాయణ రావు కు 2 పెండ్లిళ్ళు అయినాయి పెళ్ళాలు చని పోయారు 3 వాడి పెండ్యాల శంకేర్రావు మరదలు ---రాఘవ రావుకు ఒక బిడ్డ ఉమా ఒక కొడుకు శంకర్ ---కాని శంకర్ కు కంతి పుట్టింది మెడ పై --ఆది కాన్సర్ గా పరిణ మించింది --ఖర్చుల కోసం డబ్బు లడిగితే తల్లి దండ్రి లేవన్నారు నా పాలు నా కివ్వమని రాగయ్య వారితో గొడవ ప...

పార్ట్ 14

పెదమామ ఏడ్చాడు తన అక్కా దీన స్తితిని చూస్తూ ..ఆవేదనతో --- నేను బావను దక్కిన్చుకుందామనే ఆరాటంలో మిమ్మల్ని రాగంపేట నుండి తీసు కోచాను -ఈ రోజున లచ్చన్న బావ బతికితే నాకు ఎంత బలం ౧ ఎంత ధైర్యం గా ఉండేది నలుగురిలో శెభాష్ అనిపించు కునేవాన్ని --ఇంత కాలం నేను పులిలా బతికాను బావ పోయాడు కోరలు తీసిన పామునయ్యాను ఎంత ఐశ్వర్య ముంటే ఎం లాభం బలగం ఉంటె ఎం లాభం --అక్కా నీకు బావకు నీ పిల్లలకు అన్యాయం చేశానే --ఆయనను తన తలి దండ్రులకు తమ్ములకు దూరం చేశాను రోగం నయం కాలేదు పైగా మనో వేదనతో ఇంకా అవస్త పడ్డాడు బహు బాధ పడ్డాడు శారీరకంగా మానసికంగా తన వాళ్లకు దూరం అయినందుకు ---!అక్కడ వైద్యం చక్కి లేదని ఇక్కడకు తీసు కోచ్చనే గాని ఇలా జరుగు తున్డను కోలేదు --రాగయ్య వచ్చి విషం ఇప్పించి చంపించాడు డాక్టర్ను కట్టుకొని ---మహా కిరాతకులు ఈ రాగంపేట వాళ్ళు -- అక్కడనే ఉంటె ఆ తండ్రీ కొడుకులు -కొట్లాడుకున్నా కొట్టుకున్నా వాళ్ళు వాళ్ళు రక్త సంబందులు ఒక్కటి అయినా ఏమైనా ఇదే అక్కడ పోయినట్లయితే నా...

పార్ట్ 13

బాపన్న మమ్మల్ని చూడటానికి వచ్చాదనీ చెప్పాను ! బండి ఎడ్లు లేకుండా తోడూ మనిషి రాకుండా ఆ రోజుల్లో అలా ఒంటరిగా రావడం చాలా సాహసం సుమా ! ఆది ఎలా వచ్చాడంటే గంగ ప్రవాహం ఈది దాటి వచ్చాడు రాత్రి కోటి లింగాలలో పడుకున్నాడట ! తెల్లారి ఓడ మీద కొంత దూరం దాటి తర్వాత ఈడు కుంటూ ఈవలి ఒడ్డుకు చేరాడట ! ఇదంతా నాకు బాపన్న ఒకసారి చెప్పాడు ! నువ్వు అలిగితే నీకు చిల్లి పైసా ఇచ్చిన ! ఇక నీ ఏడుపు కోపం పోయింది --నీకు జ్ఞాపకం లేదు వారీ ! అని నవ్వుతు జోక్ చేసేవాడు !--ఆటను లక్షేట్టిపెటలో ఉన్నపుడు మామాలతో కలిసి ఆడుకున్న ఆటల్లో ఈత నేర్చుకోడం అతనికి ఈ విధంగా లాభించిది కదా ! ఆపాటికే మూడు వంతుల భూములను అమ్మేశారు భద్రయ్య & party బాపన్నను ఆయుధంగా వాడుకుని --ఇక్కడి ఎడ్లు నాగళ్ళు ధాన్యం అంతా ఆర్నకొండకు తరలించారు చాటుగా నేటుగా ! అమ్మ బాపన్న సీనన్న ఉన్నపుడు మా కథ రాసి ఉంటె సజీవంగా ఉండేది ! కథలో ప్రాణం బలం జీవం ఉండేది ! కాని ఇలాంటి పరిస్తితి వస్...