- అమ్మ చేసున్న పుణ్యమో సీనన్న సత్య మో -చిన్నవాడిన నోముల ఫలమో - అందరి కన్నుల పండుగ చేయడానికి నాగరాణి పుట్టింది -పెళ్లి అయ్యిన ఇరవై ఏళ్ళకి --అయితే అంతకు ముందే నేను FAMILY PLANNING OPERATION చేసుకున్నాను ఆది వేసేక్టమి -అమ్మకు కోపం వచ్చింది -నేను అన్నాను ముగ్గురు చాలు కాదే అని ! నీకు సరే సీనన్నకు ఎట్లరా ! నలుగురు పుడితే దాంట్లో ఒకన్ని -వానికి పెంపకానికి ఇవ్వచ్చు కదరా ! అంది
- బాపన్నకు ఆ నలుగురు ఉన్నారు కదా తను ఇవ్వచ్చు కదా ! అని నేను అంటే వాళ్ళు ఇవ్వ్రరట రా ! నువ్వేమో నాకు చెప్పకుండా ఆపరేషన్ చేసుకొంటివి -! ఇప్పుడు వాని గతి ఎట్లరా ! అని బాధ పడింది - వెంటనే నేను సీనన్నను అడిగి నాకు ఇద్దరు బిడ్డలు కదా -న్నీకు ఎవరూ కావాలి -నేను ఇప్పుడే నీ బిడ్డగా బడిలో పేరు మార్పిస్తాను అన్నాను -చిన్నవాడిన సీనన్న పావని అయితే చిన్న పిల్ల అమ్మ నాన్న అని మమ్ములను పిలుస్టది-!అన్నారు వెంటనే నేను స్కూల్ admission రిజిస్టర్ లో PAVANI DAUGHTER OF SREENIVAS RAO అని మార్పించి అమ్మకు చెప్పాను -అందరికి సంతోషమే ----అయితే ఆది నాలుగు నెలల తర్వాత చిన్నవదిన గర్భ వతి అని తెలిసింది -ఈ సంతోషంలో అందరు పావని విషయం మర్చి పోయారు -నాకు మాత్రం ఇంత కంటే కావాల్సింది ఏముంటుంది ?మల్లీ తిరిగి స్కూల్ ADMISSION REGISTER లో PAVANI DAUGHTER OF MANOHAR RAO అని తిరిగి మార్పించి రాయించాను -నేను టీచర్నే -అక్కడ పని చేస్తున్న వాన్నే కనుక ఈ చేర్పులు మార్పులు ఎవరికీ తెలీకుండా జరిగాయి - దీనికి పావని తల్లి పద్మ సహకారం ఎంతైనా ఉంది కాని మా ఈ త్యాగాన్ని నాగరాణి పుట్టిన సంబరంలో -కనీసం మాట వరస కైనా -పావని ని మాకు మీరు ఇవ్వడం వల్లనో - మీ మంచి గుణం వల్లనో -మాకు సంతానం కలిగింది -అని ఒక్క మాట కూడాకృతజ్ఞత పూర్వ కంగా వాళ్ళు చిన్న వదిన కాని సీనన్న కానీ అన లేదు ఆది కొంత మా ఇద్దరికీ బాధ అనిపించింది -ఎందుకంటే దీని ఫలితంగా ఒక పెద్ద గండం ప్రమాదం తప్పింది -పావనికి
- అయిదేళ్ళ పిల్ల పావని కి ROAD ACCIDENT అయ్యింది -నాగరాణి పుట్టాక -అదే రోజున ఈ సంఘటన కరీం నగర్ లో సివిల్ హాస్పిటల్ ముందు మెయిన్ రోడ్ పై ఒక స్కూటర్ వాలా వచ్చ్చి డ్డీ కొట్టాడు -నుదురు పగిలి నెత్తురు ధారగా కారింది -అంతా రక్తమే -!బిడ్డ తెలివి తప్పింది -వెంటనే అదే సివిల్ హాస్పిటల్ లో కుట్లు పడ్డాయి -వారం రోజులకు గాని ఆది కోలుకోలేదు -స్కూటర్ వాడు తప్పు తనదే అని ఒప్పేసుకుని ఎంతైనా డబ్బులు ఇస్తానని అన్నాడు -!అతని మంచి తనం చూసి వద్దన్నాం -- వరంగల్ లో వెంకట రమణ అనే పండితుడు చెప్పాడు -ఇలా పెంపకం ఇవ్వడం తిరిగి వాపస్ తీసుకోవడం -చాలా దోషం -పెద్ద గండం తప్పింది -ఎవరికైతే ఈ పిల్లను ఇచ్చారో వాళ్ళ మీది పీడా -ఈ పాప మీది నుండి పోయింది --మీ అదృష్టం -! కొంచెంలో పెద్ద ప్రమాదం తప్పి పోయింది - ఆమె మీది పీడ ఇలా పోయి ఇప్పుడు ఆమెకు సంతానం కలిగింది - మీ సంతానం తో వాళ్లకు ఫలితం కలిగింది -ఈ పాప వల్లనే వాళ్లకు ఆ భాగ్యం వచ్చింది -అని కొన్ని చెప్పాడు చిట్కాలు దోషం పోడానికి -అవి చేశాం --మంచి కోరుకున్న వాళ్లకి దేవుడు మంచే చేస్తాడు --!ఈ తృప్తి చాలు ఈ జన్మకి !
- --సీనన్న నిరాడంబరి -! సాదు స్వభావి ! ఎవరినీ ఎదీ అడిగే వాడు కాదు -మిత భాషి -దొడ్డు అన్నం -దొడ్డు బట్ట -తో తృప్తి పడ్డాడు -రూపంలో నేను మా బాపును పోలి ఉన్నా గుణంలో మాత్రం సీనన్న మా తండ్రిని తలపించాడు -అతని జన్మ నిజంగా ధన్యం! ఎందుకంటే కన్న తండ్రికి తల కొరివి పెట్టె భాగ్యం పెద్ద కొడుక్కి దక్కాలి వాస్తవంగా -! కాని బాపన్న అందుబాటులో లేకనో -అతనికి బాకీ లేకనో -సీనన్న అదృష్టమో -సీనన్న పదేళ్ళు ఉండవచ్చు ఆ సమయంలో -పెద్ద మామ సీనన్న తో చేయించాడు బాపు చనిపోయినపుడు -!
- తదుపరి బాపన్న చాలా మారాడు -పశ్చా త్తాప హృదయంతో -అయ్యో ! వాణ్ని అనరాని మాటలని పాపం చేశాను -తల్లి సేవ చేసుకుని తరించాడు - తండ్రిఋణం తీర్చుకున్నాడు -అని ఏడ్చాడు కూడా ౧ వాణ్ని నేను బాధ పెట్టానురా -కన్న తండ్రికి అగ్గి పెట్టి వాడు ఋణం తీర్చు కుంటే వానికీ అగ్గి పెట్టి నేను వాని ఋణం తీర్చు కుంటారా --!అని చితికి నిప్పు అంటించాడు అంతే కాదు సీనన్నగురించిన అన్ని నెల మాసికాలకి తనే చాత కాకున్నా ఎక్కడ వున్నా -వచ్చి మాసికం ఒద్దేక్కించాడు -చివరకు సంవత్స రీకం కూడా జరిపించాడు -
- ఇలా వాస్తవం రాయడానికి బాధగానే ఉంది -ఇదీ చదివితే అయినా వాళ్లకి ఇంకా బాధ అనిపిస్తుంది -ఎమ్ చేయను -నా లోని వ్యధను ఇలా వ్యక్తం చేయడంలో ఎవరీకైనా మనసు నొప్పిస్తే నన్ను మనసారా క్షమించాలి -ఈ జీవన చదరంగంలో మనం పావులం -ఆ పై వాడు మనల్ని ఎలా ఆడిస్తాడో -ఎవరితో ఎమ్ చేయిస్తాడో వానికే తెలుసు ! ఆడక తప్పదు ! కర్మ ఫలం అనుభ వించక తప్పదు -
- ఎన్ని ఇబ్బందులున్న ఏది ఏమైనా భగవన్నామం విడవని వారు అమ్మ సీనన్న అని ఘంటా పతంగా చెప్ప వచ్చు !బాపన్న చాలా మారాడు -అమ్మ సీనన్న లేనితనం అతనిలో భయాన్ని బాధను కలిగించింది -వార్ బాటలోనే తను పయనించాడు -నిరంతరం హరినామం భ్హజించాడు -దేవుని పూజ మరవలేదు రెండు పూతల సంద్యా వందనం నిష్టగా చేశాడు - ఆయనా ధన్యుడే -ఎందుకంటే చివరి క్షణాల్లో ఆఖరు శ్వాసతో నారాయణా -అంటూ హరి నామం జపించాడు -అంత బాధలో కూడా దైవ చింతన విడవ లేదు -అమ్మ అంతిమ ఘడియలో గాని సీనన్న తుది శ్వాస సమయంలో గాని నేను లేను -కాని బాపన్న చివరి చూపు చివరి పలుకు ఆఖరకు అతనికి చివరి సారిగా -అతనికి ఎంతో ప్రీతి కరమైన చాయ్ -టీ ని నా చేతుల మీదుగా బాపన్నకు తాగించే పరమ భాగ్యం నాకు దేవుడు కలిగించాడు -!చాలు-! అదే నాకు పది వేలు !శ్రీ కృష్ణుడు భగవద్ గీత లో స్వయంగా పలికిన వాక్యం -ఎవరైతే చివరి ఘడియల్లో నన్ను స్మరిస్తారో -అట్టి వారు నన్ను చేరుకుంటారు ! అని -బాపన్న విషయంలో అదే జరిగింది
- ఒకే తలి దండ్రుల సంతానం -నలుగురం అయినా ఎవరి కర్మ వారిదే కలిసి జీవనం గడపడంలో -ఒకరి ప్రవర్తన మరొకరికి ఇబ్బంది కలిగించ వచ్చు ! లేదా సంతోషాన్ని ఇవ్వవచ్చు ! ఆది వాళ్ళ భాగ్యం -అనే చెప్పాలి -ఆది సీనన్న అయినా - మా కన్న తండ్రి అయినా విధి చేతిలో కీలు బొమ్మలే !-కాక పొతే ఆరుగురు అన్నదమ్ములలో అతడే అంతగా చివరి ఘడియల్లో అత్త గారిట్లో తోబుట్టువులు -సోదరులు తల్లి దండ్రి కన్న కొడుకు ఆస్తి ఐశ్వర్యం -ఎన్ని ఉన్నా ఎంత భక్తీ పరుడైనా - బాధతో -వ్యధతో తపించాడు
-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...
Comments