Skip to main content

Part - 42


సీనన్న అనేవాడు -మీ  అందరికన్నా మేము  రాగంపేటలో తృప్తిగా ఉంటున్నాం  తింటున్నాం  మీకు ఆ హాయి తెలీదు -రాదు  కూడా అని !ఏమున్నా  లేకున్నా -అమ్మ తో బాటు సీనన్న కష్ట పడ్డారు అక్కడ  అయినా  వారు దేనికి వెలితి  పడలేదు -ఇదీ కావాలని  ఎవరిని  అడగలేదు  -ఎవరి ముందు చేయి  చాచ లేదు -అదీ  వారి గొప్ప ధనం -! సీనన్న  పెళ్లి వరకు అటు బాపన్నకు  అర డజను  పిల్లలు  ఇటు అక్కకు సంతానం -   అర డజనే - కాని శ్యామల రాపల్లి  నరసింహారావు తో వర  నిశ్చయం  అయ్యాక -అకస్మాతు గా పరమ పదించింది-
అయితే  వీరి  బాల్యం చిన్నతనం  చదువులు - సెలవుల్లో రాగం పేట కు రావడం అమ్మ సీనన్న  బాపన్న ఇద్దరు  వదినలు -అప్పుడే  నాకు రాగంపేటకు బదిలీ  కావడం -అందరం ఒకే చోట ఉండటం - లచ్చి  చేతుల  మీదుగా ఈ  పిల్లల స్నానాలు  ఇంటి చాకిరి - వల్ల  అమ్మకు చాలా  శ్రమ  కావడం -ఇదంతా  చూసి నేను  సీనన్న --గుమాస్తా  కాస  లక్ష్మిరాజమ్  కలిసి  వేరు పడటానికి భూముల కొలత ప్రారంభం చేశాం -ఇదీ నేను బదిలీ అయ్యి రాగంపేట కు వచ్చిన నెల రోజులోనే జరిగింది -దానికీ కారణం  చాలావున్నాయి
--పొత్తుల  సంసారానికి ముఖ్యంగా అమ్మకు చాలా శ్రమ అయ్యేది -కాలి పండ్లతో వంటా -ఇటు పిల్లలకు అటు మడి వంటకు -ఇలా నానా యాతన పడేది ---బాపన్న  వ్యవహారంలో ఇంటి విషయాలు పట్టించు కునే వాడు కాదు -ఇక  సీనన్న శ్రమ పడటమే  కాని ఉన్నది  లేనిది చూసేంత శ్రద్ధ చూపడం  లేదు -ఇందులో వచ్చే పోయే వారితో అమ్మకు చేతి క్రింద ఇద్దరు కోడళ్ళు  వున్నా తీరికే లేకపోయేది -పైగా  వ్యవసాయం లో అటు  బాపన్న ఇటు సీనన్న  తన అత్తగారిచ్చిన ఆరు తులాల బంగారం -పైగా నేను  నా జీతం డబ్బులు -ఎన్ని చేసినా -పూత  గడవడం కష్ట మయ్యేది ---సీనన్నకు  బాపన్నకు  పడేది కాదు -ఎప్పుడు వారి కి చిట పట -లాడుతూ ఉండే వారు  బాపన్నకు పత్వారిగిరిలో  తహసీల్  కట్టడం బహు కష్టంగా  ఉండేది -మామిల్ల చెలక ఎకరం  అప్పుడు అమ్మ చూపారు -నేను వద్దని ఆ  డబ్బు ఎదురు కట్టి  ఆది  విడి పించాను -ఎ  ఖర్చు లేదు కాని అన్నీ  అప్పులే -  ఇంకా  రాయలేనివి -అనుభవించ లేనివి -చాలా  కారణాలు - ఉన్న  ఇంట్లోనే మగ్గురం  ఉండటం  --ఉన్న బాలలు  గిన్నెలు  కంచాలు  అన్నీ మూడు పాళ్ళు చేశాం --ఎవరినీ  అడుగలేదు - పిలవలేదు -అంతే-ఒక బస్తా  బియ్యం తెప్పించి వేరు గా  వండుకున్నం - ఆ  రోజు నుండి ఎవరి ఖర్చులు వారివే - టిడీ  తిప్పలు వారివే -  భూములు అన్నింటినీ మూడు పాళ్ళు చేశాం -పంచడం లేదు -మంచిగానీ  చెడైనా అంతా  సమానమే -అమ్మకు మాత్రం ఇప్పుడున్న  పొలం ఒక చేను -ఒక  చేలకా వేరుగా  ఉంచాం   -వేరు  అయితే పడ్డం  కాని  ఫలితం దక్క లేదు -అమ్మ కష్టం  అలాగే ఉంది పోయింది -పెద్ద వదిన కు ఆరు కాన్పులు వెలిచాల లోనే జరిగాయి -దాదాపుగా  ఎక్కువ శాతం అక్కడ పిల్లల కోసం ఉండ వలసి రావడం -చిన్న వదిన కు పెళ్ళైన ఇరవై ఏళ్లకు సంతానం కావడం -అంత వరకు ప్రతి పని -మాట అమ్మ చిన్న వదిన ల పై భారం పడింది -అక్కా పిల్లలు రాజన్న రామన్న శ్యామల కృష్ణా ప్రసాద్ జయ ప్రద శైలజ -ఇలా సెలవులలూను -రాగంపేట లో చదువుకోసం -అక్కా బావ యాత్రలకు పోవడానికి -ఇల్లా ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో -పాపలతో కళ కళ  లాడుతూ ఉండేది --వేరు పడిన ముఖ్య ఉద్దేశం కూడా ఇదే -ఖర్చులకోసం  ఎవరికీ భాద్యత లేక పోయినా  పాపం అమ్మకు తప్పేది కాదు -అమ్మ పొలం వడ్లు  చెలక పంటా అంతా అమ్మ అటు కమలక్క పిల్లల కోసం -ఇటు బాపన్న పిల్లల కు ఇటు సీనన్న కు -బ్రాహ్మలు  ముత్తైద -పండుగలు పబ్బాలు -తన కాలి పుండు వైద్యానికి -స్వంతంగా ఖర్చు చేసే -స్తోమత అమ్మకు వచ్చింది -తనకంటూ కొంత డబ్బు -ఆదాయం ఏర్పాటుకే -నేను ఈ వేరు  ఏర్పాటు చేశాను --ఇదీ చివరి ఘడియ వరకు అక్కరకు వచ్చింది -తన అంత్య క్రియలకు తన పేరున గల అరవై వేళ బ్యాంకు డబ్బుతో చక్కగా -ఎ కొడుకు మోతాదు లేకుండా ఒడ్డేక్కింది- దాని పెద్దరికం నిలిచింది -హుందాగా కాలం గడిపింది -నలుగురికి దానం చేసుకున్నది -సుందిళ్ళ లక్ష్మి నరసింహ స్వామికి  మొక్కు  మూడు తులాల బంగారం -అర్పించుకున్నది -అక్కా పిల్ల లకు -దీపావళి -దసరా -బిడ్డా అల్లుళ్ళకు కట్నాలు పెట్టుకుంది -ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అమ్మకు న్యాయం చేశాను -అనిపించింది -తన పేరున గల చేను  అమ్మి అమ్మ పేరున బ్యాంకు లో FIXED  DEPOSIT చేశాను ఆది చాలా అమ్మకు ఉపయోగ పడింది -దానిలై వచ్చే మిత్తి డబ్బులు తనే  ఖర్చు చేసేది -

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...