Skip to main content

Part - 41


భక్తి  అంటే ఏమిటో  మన రాగంపేట గత  వైభవాలు తిరిగేసి  చూస్తే  తెలుస్తుంది  --అమ్మ  మా బాపు -ఇంకా క్రిష్ణ శాస్త్రి గారు  చాలు భాగవతులు  అని చెప్ప డానికి  --మన ఇంట్లో శంకరాభరణం  శాస్త్రి ఇంట్లో ధ్వనించి నట్లుగా   ఇంకా నాకు మా  అమ్మ సుప్రభాత గీతాలు వినబడు తున్నాయి -బహుశ  ఇప్పుడు  నిశ్శబ్దం గా  ఉన్న ఆ  దేవాలయంలో అమ్మ  సీనన్న కలిసి ఆలపించే రామనామం -భగవద్ గీత శ్లోకాలు -అండాలు స్తోత్రం -అంబరీష -గజేంద్ర -రుక్మిణి -దశమ స్కంద  భాగవత పద్యాలు ఆ  నాల్గు  గోడల మధ్య మార్మోగుతున్నాయి --వినే చెవులే  ఉంటె ఇంకా వినపడు తూనే ఉంటాయి -
అలాగే మా బాపు -తొక్కుడు హార్మోనియం తో   హరే  రామా --కృష్ణా-అని గొంతెత్తి ఆ  ఇల్లు -వాడా వినిపించేలా భక్తితో -బ్రహ్మ ముహూర్తంలో  -పాడటం రాగంపేట గ్రామం చేసుకున్న పుణ్యం --అలాగే నూరు పైగా  పురాణాలు చెప్పి భక్తియుక్తంగా  క్రష్ణా  అంటూ  తన్మయత్వం తో -లీనేమై చెప్పిన  తీరు  నా కళ్ళతో చూశాను -అంత పరవశం చెందుతూ  భగవంతుని  గుణగణాలను వర్ణించి -పురాణాలను చెప్పిన వారు  చాలా  అరుదు --వారికి  వారే  సాటి -ఒకే  గ్రామంలో ఉంటూ  చక్కని అనుబంధాలను పెనవేసుకుని -పుణ్యాత్ములు అయ్యారు -వారిని గురించి  ఇలా  స్మరించుకోడం వల్ల  మన  జన్మ  ధాన్యం అవుతుంది -వారి అడుగు జాడల్లో కొంతైనా  నడువ గలమా -!!ఇది మనం  అనుకోడం  కాదు -మన  గ్రామస్తులకు అందరికి తెలుసు -సీనన్న  కూడా  ఒకరకంగా  అదృష్ట వంతుడే -అమ్మ తో ఉంటూ  అమ్మతో  పాడుతూ అమ్మ పాడే పాటలు  పద్యాలు వింటూ -తాను కూడా భక్తుడయ్యాడు -విష్ణు సహస్ర నామాలు నోటికి చెప్పే వాడు -రామా నామం నిత్యం అనేవాడు --భాగడ్ గీత  శ్లోకాలు కొన్ని అర్థం  భావం తో  సహా గుడిలో సత్సంగ్ చేస్తూ  అందరికి  ఆశువుగా  కంచు  కంటంతో పాడే వాడు - నిత్యం సంద్యా  వందనం -మడి  పూజా -ఏకాదశి  ఉపవాసాలు --ఒకటేమిటి ?అమ్మ  ఏమేమి చేస్తుందో తాను చక్కగా అనుసరించే వాడు  -అమ్మ  గురువు  తను  శిష్యుడు --అంటే !గోడల నిండా  దూలాల  పైనా -కాపీలు  పుస్తకాలూ  అన్నింటిలోను  పెన్నుతో  చాక్ పీసుతో -రాసే వాడు -చివరకు అమ్మ తోనే  వెళ్లి  పోయాడు -
ఉన్నన్నాళ్ళు బీదరికంలో  బ్రతుకుతూ మనసును మాత్రం  భగవంతుని పై ఉంచి --ఈ ఇహలోక కష్టాలకు సుఖాలకు తల వంచకుండా -వీటికి  అతీతంగా నిరంతరం  భగవంతుని  సన్నిధానంలో  అతని  సంకీర్తనంలో గడిపి తమ  జన్మ ను సార్థకం చేసుకున్న వారి జన్మ నిజంగా  ధాన్యం -దేనికైనా  నోచుకుని పుట్టాలి -ఆ  భాగ్యం  అందరిని  వరిస్తుందా!
బాపన్న  చాలా సార్లు అన్నాడు -సీనడు నిజంగా  అదృష్ట వంతుడురా -ఆహా !వాడు  తల్లి కడుపులకేల్లి  ఎట్లా  వచ్చిందో మళ్ళ అట్లనే తల్లి కడుపులకు పోయిండు  అని --అంటే -సరిగ్గా అమ్మ దహనం అయిన స్తలం లోనే  సీనన్న ఆక్రమించడం --మధ్యలో  ఎ ఇతర ము -లేకుండా ఉండటం పడి  రోజుల్లోనే తల్లి ని  అనుసరిస్తూ స్వర్గస్తు దవటం -అందరికి  విచిత్రం  అని పించింది -!అమ్మ  లేకుండా  నేను  ఉంటానా ?అని  సీనన్న  కమలక్కతో అన్న  మాటలు నాకు  ఇంకా  గుర్తు !ఏది  ఏమైనా మంచి పేరు తో బ్రతుకు ధాన్యం చేసుకున్నారు -పోయినోళ్ళు అందరు మంచోళ్ళు -కాని వారి  పుణ్యం  వల్ల మనకు మంచి జరుగుతుండ్ -అంటే  కాదు  చేదు  చేస్తే  చేదు  కూడా  వెనుక పడుతుంది -అన్న  మాట కూడా  సత్యమే
మా  బాపు ఒకతే కూతురు  అయినందుకు  కమలక్కను చక్కటి సంభందమే  చూసి  చేశాడు --అయితే రత్నాకర్ రావు బావకు తన పెళ్ళికి  ముందునుండే తల్లి దండ్రుల తో వైరం --కొట్లాటలు   తను  వేరే ఉండటం -వారికి దూరంగా  కొట్టంలో  ఉంటూ స్వయంగా  వంట  చేసుకుంటూ ఉండటం -మా  బాపుకు చక్కగా  తెలుసు -అయినా అతన్నే  ఇష్టపడ్డాడు -ఆస్తి ఉంది ఎర్రగా  బుర్రగా  ఉన్నాడు -పైగా  మంతనిలో హైస్కూలు లో సాంబన్న మామ  కమలాకర్ మామ  భయ్యాజి  రామగుండం మనోహర్ రావు ల తో  కలిసి వంట చేసుకుంటూ  చదువు కుంటున్నాడు --అందరు  అన్నారట పెళ్ళికి  ముందే గడుసుగా కన్నవాళ్ళ తో పంతం పెట్టుకున్నాడు -ఈ  పిల్ల  అతనితో ఎమ్ సుఖ పడుతుంది --!అని  కాని మా  బాపు చాలా ఈజీగా తీసేశాడు -నాకు మాత్రం  మా  అమ్మ బాపు లతో కొట్లాటలు లేవా  -ఇది  మామూలే -!తెలివి ధైర్యం ఉన్నాయి  చాలు -అని  సమా  దాన  పడ్డాడు
నిజానికి మా  బావకున్న  తెగింపు మొండితనం -అదే  ధైర్యం -మా  బాపుకు  లేవు -అని  మా  చరిత్ర  చెపుతోంది -బ్రహ్మ ముడి అలా వేశాడు ఆ  ఇద్దరికీ
--ఎనిమిది ఏళ్ళ పిల్లకే  పెళ్లి చేశారు --సరిగ్గా మా  అమ్మకు కూడా  ఇదే  వయసులో జరిగింది పెళ్లి -ఆది ఐదురోజుల పాటు  ఘనంగా -అతి  వైభవంగా ఎందుకంటే రాగంపేట వారి  ఆస్తి  కంటే  లక్షెట్టి పేట వారి  ఆస్తులు పెద్దవి -వారు  దొరలూ  వీరు -అంటే  మేము పంతుల్లం  మాత్రమె - అందుకే  మా  అమ్మ  కలవారి  కోడలు  అయినందుకే  నాయనమ్మ  వెంకటామ్మ సూర్యకాంతమ్మ అత్త   అయ్యి రాసి  రంపాన పెట్టింది అమ్మను -  ఆ  కష్టాల  ఫలితమే  మా  అమ్మ  కాలి  కుష్టు వ్యాధి పుండ్లు -అమ్మ అనేది కూటికి చంపిండురా  --మల  మల  మాడ్చిండ్రు -ఆకలికి అన్నమో  రామా చంద్రా  అనిపించిడ్రు -హర  హర  గోషా  పుచ్చు కున్నారు -కటిక  కులం -నర రూప రాక్షసులు -ఇన్ని  నీళ్ళకు  ఎదిపించిన్ద్రురా  నన్ను -మా  తల్లిగారి  ఐశ్వర్యం చూసి  ఓర్వలేక  నన్ను నానా  యాతనలు పెట్టిన్ద్రురా  -అందుకే  వారి మొకం చూడ బుద్ధి కాదు -అరవ  చాకిరి  చేయించుకుని  ఎ రోజు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేడురా  మా  అత్త వెంకటమ్మ -డానికి బిడ్డలు ఉన్నారు -అయినా  గింత  నెనరు  కనికరం -దయ లేదురా  --ఎట్లా  పుట్టిందో  తల్లి  కడుపున --అంటూ  అమ్మా  వాపోయేది-- అమ్మ  పడ్డ  కస్టాలు  వ్యధ  బాధ మాటల్లో రాయలేం - మనసు మూగ పోతుంది  ఇందులో పడితే  బయటికి  రాలేం -
ప్రస్తుతం నేనే ప్రత్యక్ష  సాక్షిని -గతంలో  జరిగిన  సంఘటనలకు - సమస్యలకు సమాధానం కూడా  నేనే -
అక్కా  పెళ్లి  అయ్యాకా -బాపు ఎన్నో  సార్లు  బ్రాహ్మణా పెళ్ళికి వెళ్ళాడు -కూతురు నీళ్ళు  పోసుకుందేమో  అని ఒకసారి  చాలా సంబరతో అట్టహాసంగా అన్నీ  తీసుకుని వెళ్ళాడు -కాని  అయన  బ్రతికి ఉండగా  ఆ  ముచ్చట  తీర లేదు -అయినా అక్కడి  పాలేర్లకు  పని  వాళ్లకు  ఆ  రోజుల్లో  పడేసి  రుపాయలిచ్చే వాడట -వాళ్ళు  తెగ  సంబర పడే వాళ్ళట-! అక్కా  అంటే  మా  బాపుకి  చాలా ప్రేమ - -కాని  మా  అక్కకి తను  మరీ  చిన్న పిల్ల  అయినందు వల్ల ఇవేమీ జ్ఞాపకం లేవు  బాపును గూర్చి సరిగ్గా అవగాహన  డానికి  లేదు -చిన్నతనంలోనే పెళ్లి  వెంటనే  అత్త గారింటికి   --ప్పెడ్డది కాకుండానే  కాపురం  -
అక్కకు  వంట  కూడా  రాదు -పనీ  వంటా  అంతా  బావనే  నేర్పించాదట -
తర్వాత మా  బాపు  తన  అన్నదమ్ములతో  తల్లి దండ్రులతో -వైరం పెట్టుకోడం  కొట్లాట  తీవ్ర తరం కావడం -ఇంట్లోంచి బయటకు  వెళ్లి  రావడం  మూలాన అక్కకు బాపు అమ్మ గురించిన  విషయాలు  తెలియవు -బాపును చూడటం కూడా తక్కువే -! వస్తే  బాపే రావాలి గాని తను వెళ్ళలేదు  రాగంపెటకి--
బాపు  అనారోగ్యంతో అత్తవారి  ఇల్లు చేరడం -విని ఒకసారి బాపును  చూడటానికి అక్కను  తీసుకుని  బావ లక్షెట్టి పేటకు  కచ్చలం బండిపై తీసుకుని వచ్చాడట -!ఇదంతా  అక్కా  చెప్పుతోంది -! ఆరు నెలలు  మంచాన  పడి అయినా వారికోసం ఆక్రోసించి దిగులుతో ఇంకా  శుష్కించి పోయాడు -వాల్లెవ్వరు ఇటు  తొక్కి  చూడలేదు కనీసం  బాపన్నను  పంపలేదు --
బావతో  మా  బాపు  అన్నాడట -తలిదండ్రులతో  మంచిగా  వుండు -వాళ్ళు  ఎమన్నా  ఓర్చుకో అని -!బావనేనా మాట ఒర్చుకునేది ? ఇది కేవలం తనకి మాత్రమె వర్తిస్తుంది -!ఎదిరించక  పోవడం - ఎదిరించడం -వారి  ఇద్దరి మధ్య ఉన్న  వ్యత్యాసం ! ఇదీ జీన్స్ లో ఉన్న మహత్తు -! చూస్తే  వచ్చేదా? నేర్చుకుంటే  అలవాడే  గుణమా ?
పాపం కూతురి ముద్దు  ముచ్చటా చూడ కుండానే పోయాడు -అప్పుడు కోటి లింగాలలో  తండ్రికి  కొరివి పెట్టలేకున్నాగాని పడవ రోజు కర్మ బాపన్న చేస్తుంటే అక్కా  బావ వచ్చారట -! తర్వాత  అమ్మ జబ్బు పాలవడం  -అమ్మను  ఎవరూ  భరించే  స్తితిలో లేక పోవడంతో  సుందిళ్ళ  లక్ష్మీ  నరసింహ  స్వామీ సన్నిధిలో చేరడం -ఇక్కడ అక్కా మొదటి కానుపు కోసం  అమ్మ  బాపు లేని లక్షెట్టి పేటకి  పురుడుకై  రావడం -మేనమామల ఇంట్లో అక్కా బేలగా పురుడు పోసుకోవడం -ఇదంతా  మా  అమ్మ  చూడ లేదు -అప్పుడు అమ్మ  పరిస్తితి అతి  దారుణంగా చావు  బ్రతుకుల మధ్య  కొట్టు మిట్టాడుతూ -ఎవరు దిక్కు ?అన్నట్లుగా  -ఇంకెవరు  -దేవుడే దిక్కు ?-అదే మా  భక్తి మార్గానికి  నాంది పలికింది   --కూతురు  అత్త వారింటిలో -నేను సీనన్న లక్షేట్టిపెటలో  --బాపన్న రాగంపెతలో -తను సున్దిల్లలో -తలా ఒకవైపు విధి చేత   నిర్దయగా  విసిరి వెయ బడ్డారు -అమ్మ  చేసుకున్న  పుణ్యమే ఇప్పుడు మమ్మల్ని ఒక  దారికి తెచ్చింది -బాపు కున్న విధేయత  ప్రేమ -అమ్మ కున్న దైవ భక్తీ -వారి  సంతానానికి  ఇంత భిక్ష  పట్టెడన్నం -పడి మందిలో గౌరవం -కీర్తి తెచ్చి పెట్టాయి
అక్కకు  పుట్టిన తోలి సంతానం కూతురు -శ్యామల -చాలా  అందమైన  -దివ్యమైన తేజస్సు గల బిడ్డ -ఇప్పుడున్న ఈ ఐదుగురి కన్న తెలివిగల  అమ్మాయి
--అయితే  ఈ  పాప  బారసాల కు  కూడా   అమ్మ తన ఆనందం పంచు కోలేక పోయింది --అక్కా   బారసాల అయ్యాక తిర్గి  బ్రాహ్మణా పెళ్ళికి వెళ్లి పోయింది
తర్వాత జరిగిన  కాన్పులన్నీ అక్కడే బూది- అనే ఆమె  ఆసరాతో  జరిగాయి -
ఇక్కడ రాగంపేట లో మన ఇంట్లో లచ్చి  ఎ విధంగా ఇంటి మనిషిగా మిళితం  అయ్యి పని చేసిందో --అలాగే  అక్కడ  బూది కూడా చేసింది -వాళ్ళ  ఋణం తీర్చుకోలేం  మనం -ఎ జన్మ  సంభందమో  మాకు  మా  పిల్లలకీ  అంతులేని సేవ చేశారు -బదరీ -గయ తీర్థాలలో వారిని మరవకుండా పిండ ప్రదానం చేశాను నేను -నిజానికి  మన మనుగడకు ఎందఱో చేయుట  ఇస్తున్నారు -మనకు సంతోషం -సౌకర్యం కలుగ చేస్తున్నారు -!కాని  మనం ఎంత మంది  ఆనందానికి సహకరిస్తున్నాం ? మానవ  జన్మ  సార్తకతకు మన  కృతజ్నతకు  కనీస  ధర్మం  తోటి వారి ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించడం
అంతర్ మధనం  ఇలాంటి సందర్భాలలో తప్పక అవసరం -ఏమి చేశాం ?  ఏమి  చేయాలి ? ఎమ్ చేస్తున్నాం? ఎంత సేపు స్వార్థం కోసం ఆలోచన చేయడమేనా ? ఇప్పుడైనా ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన రాదా ?-

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...