Skip to main content

పార్ట్ 9

లవ కుశ సినిమాలో అన్ని అణిముత్యాలే పాటలు పద్యాలు కమనీయంగా హృద్యంగా ఉన్నాయి అలాంటి దృశ్య కావ్యం న భూతో న భవిష్యతి విధి విధానమును ఎవరు తప్పించగలరు ఎ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరు ---పాట
రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలూనే !...అంటూ విధీకి నెంచ అసాధ్యంబు విధికి గలదే ...!
నా చిన్నతనంలో 8 తరగతిలో బాలల బొమ్మల రామాయణం కొని చదివాను అందులో నన్ను కదిలించిన కన్నీళ్ళు తెప్పించిన
ఘట్టం భరతుడు తన తల్లిని దూషించిన తీరు ...!ఎన్నడైనా నేను నీతో నాకు రాజ్యం కావాలని కోరానా ..నా మనసు ఏమిటో నేనేమిటో నాకేం కావాలో అగ్రజునికి రామునికి తెలుసు వదిన సీతమ్మ తల్లికి తెలుసు కౌసల్య మాటకు తెలుసు కుల గురువు వసిస్తులవారికి తెలుసు నా కన్న తండ్రికి తెలుసు కాని నీకు మాత్రం కన్న కొడుకు మనసు తెలీదు ! నీవేం తల్లివమ్మా..!నేను చేయని తప్పుకు నన్ను బలి చేశావు నా చరిత్రకు కళంకం తెచ్చావు నా సోదరుల ముందు నా ప్రజల ముందు సేవకుల ముందు ప్రజల ముందు నన్ను తల దిన్చుకోనేలా చేశావే బయట ప్రపంచంలో నేనెలా తలెత్తు కొని తిరుగ గలను ..!
ఇంత హీనమైన ఆలోచన నా తమ్మునిదా అన్న రామన్న నన్ను తిరిగి ఆడరించేనా నేను బ్రతుకుట వ్యర్తము ఛీ చ్చీ
నీవు నాకు తల్లివి కావు ! నేను నీకు కొడుకుని కాదు ! ఈ జన్మలో నేను నీ ముఖము చూడను ! అంటూ బాధతో వెళ్ళిపోతాడు తాల్లి కైక వద్దనుండి .....---నా కు దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది నాకెందుకో ఇంత సున్నిత మనస్త త్వం దేవుడిచ్చాడు
అమ్మ ఇది గ్రహించిది ఇంత మెత్తని మనసు ౧చాల కష్టం రా ఈదటం ఈ కాలంలో ...అంది
ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తన కంటూ వ్యక్తిత్వాన్ని నిలబెట్టు కుంది మా అమ్మ --ఎవరికీ చేయి చాచ లేదు ఇది కావాలని అడగ లేదు ఆకలికి పైసలు లేకున్నా తన జీవి తాంతము అలానే ఉంది ఒకరికి ఇవ్వడమే కా ని అడిగింది లేదు తనకి ఉన్నదాన్లో తృప్తి పొందింది ఎపుడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే దానిని దాచుకుని దేవునికో ముత్తిడువకో బ్రాహ్మనునికో ఇచ్చింది ఎన్ని ఉపవాసాలో తన కడుపు కట్టుకుని మమ్మల్ని సాదింది ఆమె ఒక సాద్వి కూటికోసం బట్టకోసం తనకు కావాలని ఎన్నడు ప్రాదేయపడలేదు ఆమె శీలం చాలా గొప్పది
-- విపరీతమైన అభిమానం అమ్మది ! ఒక్క మాట గూడా పాడేది కాదు గూడూరి దొరసాని ప్రాణం పోయినా కూటికి లేకున్నా మాట పడరు అని నవ్వుకుంటూ గమ్మత్తుగా అనేవాడు
ఎ ఇంటినుండి బయటకు భర్తతో సహా ఎ నాడు పిల్లలతో వెళ్లి వచ్చిందో మళ్లీ ఆ గడప త్రోక్కలేదు మాటంటే అంత పట్టింపు ఆమెకు ఏది ఏమైనా పాళీ వాళ్లకు తన మొహం చూపలేదు వాళ్ళను గత్యంతరం లేక దారిలో తారస పడితే మొహం తన కొంగుతో చాటు చేసుకునేది
వారికి తను బ్రతికి నన్నాల్లు మాట్లాడ లేదు వారి మొహం చూడలేదు తాత వెంకటమ్మ చిన్నాయనలు చిన్న్నాయిలు పోయినా దూరంగానే ఉంది అంత పట్టుదల గల మనీషి అమ్మ అన్నీ కష్టాలే ఆమె జీవితంలో మా అమ్మ పడిన కస్టాలు ఎవరూ పడలేదేమో రామాయణంలో సీతలా అరణ్యంలో వన వాసంలో ఉంది భారతంలోని ద్రౌపదిలా అవమానం పాలైంది ఆఖరు క్షణం వరకు ఆమెను త్రాచు పాములా వెంటాడిన కుష్టు వ్యాది ఆమెను కడుపు నిండా తిన నివ్వ లేదు త్రాగా నివ్వలేదు కంటి నిండా నిద్ర పోలేదు ! పాపం పెరుగు పప్పులు నేయి మామిడి పండ్లు టీ కాఫీ పాలు అన్నిటికీ దూరం గా ఉంటూ పులుసు తోక్కులతో శాకాలతో కడుపు నింపు కునేది
ముఖ్యంగా తను ఎవరినీ మాట అనేడికాదు భరించలేని బాధ కలిగితే తప్ప కోపాని కోచ్చేదికాడు
దేవుడు మందిచ్చాక సుందిళ్ళ నుండి తిరిగి లక్షెట్టి పేటకు వచ్చింది మా ఇద్దరినీ వెంట పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే అసలు కథ ప్రారంభ మైంది ఎంత కాలం చెడి పుట్టింట్లో ఉండటం ! ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళ గాథను భరించటం ..దేవుడిచ్చిన మందులో సగమే తాగింది కనుక వ్రణ శేషం చాలా బాధ పెట్టింది
లక్షెట్టిపేట కు గత్యంతరం లేక రానైతే వచ్చింది కాని అంతకు ముందు కంటే సమస్యలు ఎక్కువైనాయి ..పీడా పోయిందను కుంటే మళ్లీ దాపురించింది అనుకునే వాళే --యాష్ట పడనారంభించారు నీడ పదనివ్వడం లేదు కన పడితే చీత్కారం నిర్లక్ష్యం .--మనిషికి సమాజంలో విలువ హోదా డబ్బు బలగం పరపతిని బట్టే ఉంటుందికద ౧ ! నిలువ నీడ లేదు ఆదరించేవాడు లేడు
అప్పుడు ఇద్దరు మామలకు కొత్తగా పెండ్లి అయినాయి పైగా ఉద్యోగ అన్వేషణ లో ఉన్నారు పెద్దమామ అంటే గజ గజ వణకే వారు ఆయనకు కనపడే వారే కాదు వారి పరిస్తితి యె అలా ఉంటె మిగతా వారు నోరెత్త లేరు -అంత భయ పడే వారు ఆయనంటే
గజ్జెల చప్పుడు వినపదిందంటే చాలు ఎక్కడి దొంగలు అక్కడనే ! ..అమ్మ నేను మేము ఇంటి వెనకాల ఇప్పుడు శరత్ నీరజ ఉంటున్న ఇంటి అడుగున ఒక పందిరి ఉండేది దానికింద మా నిద్ర తిండి బస ! దొంగల్లా తింటూ ఎవరికీ కనబడ కుండా తిరిగే వాళ్ళం బడి లేదు గుడి లేదు అంగీ లాగు లు లేవు చాలా దయ నీయంగా ఉండేది మా బ్రతుకు ! అమ్మ కాలి పుండు సరే సరి ఆది అమ్మను ఇంకా అలాగే బాధ పెడుతూనే ఉంది అమ్మ ఎవరితో మాట కాని కన బడటం కాని లేదు వైద్యం అసలే లేదు పుండు చీముకు వస్తుందని ఏమి తినేది కాదు

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...