అన్నమయ్య సినిమా లో అన్నమయ్య ఇద్దరు భార్యలను అన్నమయ్య నుండి వేరు చేసి చదరంగంలో పావులను కదిపి నట్టుగా తొలగించి శృంగార కీర్తనలతో తనను కీర్తించిన అన్నమయ్య ను వైరాగ్య తత్వం అలవదేట్టు చేస్తాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు .. అలాగే భర్త అనే పావును తీసేసి అమ్మను భక్తురాలిగా మార్చాడు ఆ దిదేవుడు .ఏదైనా పూర్వ జన్మ కృప ఉంటేనే ఆ దేవదేవుని కీర్తించే అవకాశం లభిస్తుంది అయన కరుణ తోనే ఈ పావులు కదీలెవి
అమ్మకు నరసింహ స్వామీ కలలో మందు పోశాదట సగం తాగాక తెలివోచ్చిందట ..ఇంకా పుండ్ల వల్ల మంటలు రావడం తో సన్నటి మట్టి పోసేదట భాద భరించ లేక .--తర్వాత పసుపు పోయడం చేసేది చంన్దనాపురం గ్రామం సింగయ్య పంతులు పెద్ద మనిషి అమ్మను అపుడపుడు చూసి పోయేవాడు
బ్రాహ్మణులను దైవాన్ని నిరంతరం ఆరాదించేది ప్రతి ముత్తైదువులో అమ్మవారి ప్రతి రూపాన్ని చూసుకునేది తృణమో పణమో తనకున్నది సమర్పించు కునేది స్వామీ ఒకసారి తన కలలో నాకు 3 తులాల బంగారం బాకీ ఉన్నావు అని అడిగాడట ఆది చేయించే సమయానికి సత్తెన్న మామ సుందిళ్ళ కు పోవడం జరిగింది అప్పుడు నేను వీరన్న అయ్యప్ప దీక్షలో ఉన్నాము గోదావరి khani లో అప్పుడు వీరన్న ఉంటున్నాడు నన్ను భిక్షకు పిలిచాడు వెళ్లాను అంతే ! మా అమ్మ సత్తెన్న సున్దిల్ల్ల స్వామీ దర్శనానికి వెళ్ళడం సత్తెన్న చేతుల మీదుగా ఆ బంగారు నెక్లేసు అమ్మ స్వామికి వేయించడం jarigaayi
ఇలా ఆ దేవుని అజ్ఞా లేనిది మనం ఏది చేయలేము
అమ్మ అంతిమ ఘడియల్లో అన్ని రోజులు రాత్రి పగలు అమ్మను కానీ పెట్టుకున్న నేను సరీగ్గా అదే సమయానికి అమ్మకు
మందులు తేవాలని పోవడం బాపన్న వొడిలోనే అమ్మ కను మూయడం అంతా దైవేచ్చ ! దేవుడు మందు పోయడం తో అమ్మ జీవితం ఒక క్రొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది అక్క్కడికి బాపన్న అమ్మను మమ్మల్ని చూడటానికి వచ్చాడు!!
వెళ్ళాడు కాని అప్పటికి అతనికి 14 ఏళ్లే! అమ్మను మమ్మల్నీ ఈ దుస్తితిలో కళ్ళారా చూశాక ఆ స్వామీ దయ వల్ల అతనిలోఅంతర్మదనం మొదలైంది .--రాగంపేట కు వెళ్ళాడు! కాని అమ్మను తమ్ములను !రావాలనే తలంపు కలిగింది
కాని ఆది అతనికి దుస్సాధ్యం --పెద్ద పులుల వలె చిన్నాయనలు సింహం లాంటి వెంకటేశ్వేర రావు తాత బొత్తిగా తన వయసుకు మించిన పని ! ఇల్లు ఏది ? ఎక్కడ ఉంచాలి ? ఎ ఇంటిలోంచి వీళ్ళు వెల్లగోట్టారో ఆ ఇంటిలోకి వస్తారా ! తీసుకు రావడం భావ్యమా ? ఆ చిన్న మనసులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో భావాలు ! ఎంతో భాద కూడా! ఏమి చేయాలి ! తను ఏమి చేయ గలదు ! ఒక వేదన మొదలైంది అతనిలో -- బాపు పోయాక ఈ మూడేండ్లు తను ఇక్కడే చిన్నాయనల పంచ లో ఉన్నాడు !
నీళ్ళ నుండి వేరైన చేపలా ఒంటరిగా ! రాగంపేట పట్వారి అనే ముళ్ళ కిరీతాన్న్ని ధరించి !ఇక్కడ ఇలా ఉంటె అక్కడ అమ్మ పరిస్తితి మరోలా ఉంది ! అదే సమస్య ఎటు పోవాలి ! ఏమి చేయాలి ! తను ఆడది ! అబల ! అప్పటికి అమ్మ 30 ఏండ్లు మాత్రమె
స్వతంత్రించి ఎ నిర్ణయం తీసుకోలేని నిస్సహాయురాలు ! బాపు పోయిన ఈ 4 ఏండ్లు ఎంత దీన స్తితిని అనుభవించామంటే అనాధ ల్లా వీధిలో బిచ్చగాల్లల బ్రతికాము ఒక పైసా మా చేతిలో ఉండేది గాదు ! ఎవరివ్వాలి ? ఎవర్ని అడగాలి ? ఎవరు దయ దాలిస్తే అటు వెళ్ళడం తప్ప చేయ గలిగింది ఏమీ లేదు --అయినా అమ్మ వొడి కట్టుకుని మమ్మల్ని సాకింది కంటికి రెప్పల్లా కాపాడింది ఎటు వెళ్ళాలన్నా నడిచి పోవడమే ! ఈ ఆటోలు ఇన్ని బస్సులు ఈ రోడ్డులు ఇంత విజ్ఞానం తెలివి డబ్బు అప్పుడు లేవు సుందిళ్ళ గ్రామం చుట్టూ అడవి ఎలుగు బంట్లు నక్కలు తిరిగేవి ! ఎవరైనా రా దల్చుకుంటే కచ్చరం ---అంటే బండెడ్లు కట్టుకుని రావాల్సిందే --ఆది రాత్రి చీకటి కాకముందు ! అందుచేత మమ్మల్ని చూడటానికి రావాలన్న ఏదైనా తెచ్చి ఇవ్వాలన్న అంత సులభం అయ్యేది కాదు ! అయినా ఎవరొస్తారు వచ్చినా చూసి పివడం తప్ప ఎం చేయగలరు చెప్పు ?
ఇంకా ఉంది
Comments