తాత వెంకటేశ్వేరరావు అంటాడు ఈ ఆస్తి నేను నిన్న్నురాగంపేట వీరయ్య పంతులుకు పెంపకాని కిస్తే నీకు ఆస్తి వచ్చింది !లేకపోతే అర్నకొండలో ఆరో భాగానికి ఉండేవాడివి నీవు! మా బాపు అంటాడు కదా --నిజమే ఆస్తి వచ్చింది నీది కాదు ఆది వీరయ్య పంతులుది --అయన ఇవ్వాలి నీకు తమ్ములకు నేను ఇవ్వలేను ! ఎందుకంటే ఇది రేవెల్లి వాళ్ళ ఆస్తి మీరు చల్ల్లూరు వాళ్ళు ఈ ఆస్తిని నా చేతిలో పెట్టింది వంశాన్ని ఉద్ద రించమని ఆస్తిని కాపాడమని నా తమ్ములకు పంచి ఇవ్వదానికేనా నీవు ఆస్తి పై కన్ను వేశావు నీవే ఈఆస్తిని పంచు !నేను పంచలేను ఆ వీరయ్య పంతులే ఉంటె ఇలా నీవు చేసే వాడివా !అడిగే వాళ్ళు లేరని ఆయనకు అయన ఉప్పు తింటూ అధర్మం చేస్తామా !ధార పోసింది నన్నోక్కన్నే నా తమ్ముళ్ళను కాదు కదా ! అయన ఆస్తిని పంచి ఆయనకు ద్రోహం నేను చేయలేను నీవే ఈ ఆస్తిని పంచుకో -----అని
ఇది ధర్మ సందేహం ఆ నాడు కురు సభ లో ద్రౌపదికే వచ్చింది ! ఇపుడు మా అమ్మకే వచ్చింది !తండ్రీ కొడుకుల తగాదాల మధ్య తను నలిగిపోయింది పిల్లలు యాతన పడ్డారు వెంకటమ్మ అమ్మను చాల కష్టపెట్టింది తిండి పెట్టక మాడ్చింది సీనన్న పుట్టినపుడు అమ్మకు పాలు లేక పోతే పాల కోసం బాగా ఏడ్చాడట ఇల్లంతా ద్వనిన్చేదట అయినాఆ
కథినురాలి మనసు కరుగ లేదట రోజు రామ కోటి రాసే ఆ పెద్ద మనిషికి వేంకటేశ్వరస్వామీ అయన కల్లోకొచ్చి ఒక్క చెంప దెబ్బ వేశాడట రామకోటి రాస్తున్నావు పసి పిల్లాడి ఏడుపు విని పించాడంలేదా !అందుకే నీకు అజీర్ణ రోగం రోజు వాడికి పాలివ్వు !నీకు నయమవు తుంది ! అని కల వచ్చిందట ! ఆ రోజునుండి భార్యకు తెలియకుండా రోజు పాలు పితికే మనిషి ఎర్రయ్య తో చెప్పి సీనన్నకు పాలు ఇప్పించే వాడట పిల్లాడి ఏడుపు బందు అయ్యింది వెంకటమ్మ కు అనుమానం వచ్చింది ఎర్రయ్య పాలు పోయడం కాపు కాసి కానీ పెట్టింది అంతటి పెనుగొండ రాక్షసి ఆమె రోజు ఆరు బర్ల పాలు తాగే వారు ఇంట్లో కాని బాపు కుటుంబం ఆకలితో అల్లది పోయేది
మంచి నీళ్ళ బావి కాడ చాటుగా కిష్టయ్య గారి తల్లి అన్నం పెట్టె దట కమలక్కకు కట్టుకోడానికి దొడ్డు బట్టలు ఇచ్చేడట చుట్టూ ప్రక్కల బ్రాహ్మణులూ పాపం అనే వారు అమ్మను !పెరుగు పాలు నెయ్యి ఎన్నో రకాల పలహారాలు తన గదిలో పెట్టుకొని తొక్కు పులుసు అన్నం పెట్టేదట
దొడ్డికి బయటకు వచ్చేది కాదట విస్తర్లో పోతే అనంతమ్మ బయట పారేసేది అంతగా అత్తరికం చేసింది వెంకటమ్మ దాని ఫలితమే మా అమ్మకు కుష్టు వ్యాధి రావడం
పెద్దింటి బిడ్డ అయినా తినడానికి తిండి కట్టు కోడానికి బట్టా కనీసం ఉండడానికి ఇల్లు కూడా నోచుకోలేదు అమ్మ పుస్తెతో బాటు కస్తాలనుకుడా మెడకు కట్టుకుంది
ఇక తల్లి గారింట్లో ----------బాపు పోయాడు పెద్ద కొడుకు దాయాదుల పంచలో వారి దయా దాక్షిణ్యాలక్రింద పడి ఉన్నాడు ఏమి తింటున్న డో ఎలా ఉన్నదో తెలీదు
నేను సీనన్న చిన్న వాళ్ళం మనోవ్యాది తో అనాధల్లా గడుపు తుండగానేఅమకు రెండుకాల్లలో పుండ్లు మొదలయ్యాయి నడవ లేక పొయ్యేది భాద భరించలేక ఏడ్చేది ఎవరో చెప్పారు అడవిలో దొరికే విష్ ముష్టి కాయల తో వైద్యం చేయాలని అప్పుడు ఒక సంచి కాయలు తెస్తే ౨౫రుపయ lu
అయ్యేవి ఎవరివ్వాలి ఎవరు తేవాలి అయినా నలుగు సార్లు తెప్పించారు అవి దంచి ఆ ముద్హలో రెండు కాళ్ళు పెట్టి రెండు గంటలు ఉంచితే పుండుల్లోంచి౧౦ ౧౫ పురుగులు
పడేవి ఈ దృశ్యం చూసి వాసన భరించ లేక దగ్గరికి రాక దూరంగా ఉండేవాళ్ళు అంతా దాదాపుగా వెలి వేసినట్టుగా ఉండేది ఇది భరించ లేక గంగలో పడదామని చాల సార్లు గంగ తోవ వెళ్ళింది అన్నం నూరుకొని తినే యత్నం చేసింది కాని మేము దిక్కులేని వాళ్ళం అవుతామని అన్నీ భరించింది దిక్కులేనివారికి దేవుడే దిక్కని రోగాలు నయం చేయగల సమర్థుడు సుందిళ్ళ స్వామిని ఆశ్రయించింది నన్ను సీనన్నాను తీసు కొని వెళ్ళింది
తడిబట్టలతో ఉదయం సాయంత్రం ప్రదక్షిణాలు స్వయం పాకం కరెంటు లేదు జోరుగా గాలి వాన కట్టెలు మందేవి గావు ఇప్పుడున్న వసతి అప్పుడు లేదు జనాలు ఇద్దరు ముగ్గురికంటే ఎక్కువ వచ్చే వారుకాదు అందరు ఉంది అన్నీ ఉంది ఎవరికీ ఏమీకాని పరిస్తితి ఇలా రెండేండ్లు కష్ట కాలం బ్రతుకు ఈడ్చింది ఆ ఉరివాళ్ళు పాపం అనేవాళ్ళు అమ్మను అడుకోనేవాళ్ళు భజనలు చేసేవాళ్ళు గుడి చుట్టూ పొలాలు దూరంగా చెలిమే ఉండేది గుడి బండల్లో కప్పలు పాములు తిరిగేవి దైవం పై భారం వేసి ఎన్నో రాత్రులు ఒంటరిగా ఆ బండలపై కొంగు పరచుకునీ పడుకునేది సీనయ్య దొర అని తాత అమ్మకు ధైర్యం చెప్పే వాడు పూజారి నర్సయ్య గారు మంచివాడు తిండి తిప్పలు చూసే వాడు అమ్మ బాధ చూడ లేక అమ్మవారు
Comments